స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇకపై గేరు మార్చకపోతే నష్టం తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా తీసుకోవాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఓట్ శాతం మరింత పెరగాలని నిర్దేశించిన చంద్రబాబు..ఓటు శాతం తగ్గితే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయనట్టేనని హెచ్చరించారు. ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో సంబంధాలు వంటి అంశాలతో ఎమ్మెల్యే…