Parenting Paradigm: పిల్లలపై పెత్తనం ఆపండి.. సద్గురు చెప్తోన్న పేరెంటింగ్పై నెట్టింట్లో చర్చ
నేటి కాలంలో పిల్లలను ఎలా పెంచాలి అనే దానిపై సోషల్ మీడియాలో, పుస్తకాల్లో వేలకొద్దీ సలహాలు కనిపిస్తుంటాయి. క్రమశిక్షణ, గైడెన్స్ పేరుతో తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం ఒత్తిడి పెంచుతుంటారు. అయితే, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగదీష్ వాసుదేవ్ ఇటీవల ఒక వీడియోలో దీనికి పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు పిల్లల పెంపకం (Parenting) ఆపేయాలని ఆయన సూచించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. పిల్లలు మీ ఆస్తి కాదని, వారిని నియంత్రించడం మానేయాలని…