గుడ్మార్నింగ్.. AI టీచర్! ప్రభుత్వ పాఠశాలలో రోబో ఉపాధ్యాయురాలు!
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యా రంగంలో కూడా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా, బైందూర్ సమీపంలోని 111 ఏళ్ల పురాతన వందేస ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఒక వినూత్న ప్రయోగం ప్రారంభమైంది. ఇక్కడ జనరేటివ్ AI ఆధారిత టీచర్ రోబోట్ను ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐరిస్ అనే ఈ హ్యూమనాయిడ్ రోబోట్ను NITI Aayog ఆధ్వర్యంలోని…