సీనియర్ నటి పావల శ్యామల మరణం తర్వాత ఆమె కుమార్తె, మెగాస్టార్ చిరంజీవితో ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని మెగాభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఖండిచారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత కొండేటి సురేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
‘సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం తర్వాత.. ఆమె కుమార్తె పలు యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడుతూ ఇండస్ట్రీని, ముఖ్యంగా కొంత బ్లేమ్ చేసేలా చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మేలు చేసిన చేతులకే మళ్లీ నిందలు వేయడం కరెక్ట్ కాదనిపించి నేను స్పందిస్తున్నాను. ఈ విషయంలో ఇటీవల దర్శకుడు వి. ఎన్. ఆదిత్య తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు కూడా. పావలా శ్యామల మరణానంతరం కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు కేవలం వ్యూస్ కోసం ఆమె కుమార్తె చేత చిత్ర పరిశ్రమపై, ప్రముఖులపై తప్పుడు ప్రచారం చేయించడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు, ఆర్థిక సహాయాలకు కొన్నింటికి నేను ప్రత్యక్ష సాక్షిని. పావలా శ్యామల గారి ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైన తొలినాళ్లలోనే చిరంజీవి గారు స్పందించి.. ఆమెకు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’లో మెంబర్షిప్ ఇప్పించారు. అప్పట్లోనే దాదాపు రూ. 1,01,500 ల భారీ మొత్తాన్ని చిరంజీవి స్వయంగా చెల్లించి ఆమెకు ఆ కార్డు ఇప్పించారు. ఈ మా మెంబర్షిప్ కార్డు వల్లే పావలా శ్యామలకు ‘మా’ అసోసియేషన్ నుంచి ప్రతి నెలా పెన్షన్ వచ్చే సదుపాయం కలిగింది. దాంతో పాటు ఆమెకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కూడా కల్పించి.. ఆమె వైద్య ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చిరంజీవి ముందే పక్కా ప్లానింగ్ చేశారు’,
‘కేవలం కార్డు ఇప్పించడమే కాకుండా.. చిరంజీవి గారు అంతకు ముందు రెండు లక్షల రూపాయలను ఇలా…ఎన్నోసార్లు పావలా శ్యామలకు సహాయం అందించారు. కేవలం పావలా శ్యామల మాత్రమే కాకుండా.. గతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడి మృతి చెందిన టీఎన్ఆర్, గుండు హనుమంతరావు, మరియు ఆరోగ్యంతో అప్పట్లో బాధపడిన అల్లరి సుభాషిణి వంటి ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులను కూడా చిరంజీవి గారు నా ద్వారానే ఆదుకున్నారు. ఇంత చేసిన గొప్ప వ్యక్తిపై సామాజిక మాధ్యమాల్లో బురదజల్లడం కరెక్ట్ కాదు. ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆమె బాధ అంతా కూడా తన తర్వాత తన కుమార్తె జీవితం ఏమవుతుందనే భయంతోనే సాగిందని పేర్కొన్నారు. అయితే కొంతమంది ఆమె బలహీనతలను, ఆమె కుమార్తె పరిపక్వత లేని మాటలను ఆసరాగా చేసుకుని ఇలా చేయటం దారుణం. పావలా శ్యామలకు ఇచ్చిన గౌరవార్థం.. ఆమె కుమార్తెకు సహాయం చేయడానికి ఇండస్ట్రీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నిజానికి గతంలో తెలంగాణ ప్రభుత్వం, ‘మా’ అసోసియేషన్ మొదలుకొని.. చిరంజీవి గారు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, సాయి దుర్గ తేజ్, దిల్ రాజు లాంటి ఎందరో ప్రముఖులు అనేకమార్లు ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. అలానే చాలామంది చిన్న, పెద్ద నటులు కూడా ఆమెను వ్యక్తిగతంగా ఆదుకున్నారు. కానీ పావలా శ్యామల, ఆమె కుమార్తె వారి మానసిక ఆందోళనల వల్ల తమకు సేవ చేసే వారితో, చుట్టుపక్కల వారితో దురుసుగా ప్రవర్తించేవారని.. దానివల్ల ఏ ఒక్క హోమ్లోనూ వారు కొద్దిరోజుల కంటే ఎక్కువ కాలం ప్రశాంతంగా ఉండలేకపోయేవారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. చివరికి తమకు సహాయం చేసిన పెద్దమనుషులను కూడా వారు అనుమానించడం, దూషించడం వంటివి రిపీట్ అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఎవరో మైక్ పెట్టారని.. పరిస్థితి ఏమాత్రం బాలేని ఆమె కుమార్తె ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తూ మాట్లాడితే, దాన్ని నిజమని నమ్మి కొందరు చిత్ర పరిశ్రమ గురించి బ్యాడ్ ప్రచారం చేయడం శోచనీయం’
కానీ నిజానికి ఆమె అంతిమ క్షణాల్లో, అంత్యక్రియల్లో కూడా మా అసోసియేషన్ మరియు చిత్ర పరిశ్రమే పూర్తి బాధ్యత తీసుకుని నిలబడింది. ప్రస్తుతం ఆమె కుమార్తె బాగోగులను కూడా ‘మా’ సభ్యులే దగ్గరుండి చూసుకుంటున్నారు. సహాయం చేసి కూడా ఇలాంటి నిందలు పడాల్సి రావడం దురదృష్టకరం. ఏదేమైనా.. చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాలు, గుప్తదానాలు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్న ప్రతీ చిన్న నటుడికి వెన్నుదన్నుగా నిలవడంలో చిరంజీవి గారు ఎప్పుడూ ముందే ఉంటారు. కేవలం తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా, సినిమా రంగాన్ని నమ్ముకున్న ప్రతి కుటుంబం బాగుండాలనేదే చిరంజీవి గారి ఆశయం. ఈ రకమైన అసత్య ప్రచారాలు చేస్తున్న వార్తలను నమ్మవద్దని, వాస్తవాలను గ్రహించి ఇండస్ట్రీ పెద్దలకు మద్దతుగా నిలవాలి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత ఆయన సొంతం’
అని రాసుకొచ్చారు సురేష్ కొండేటి.
సురేష్ కొండేటి పోస్ట్..
నా ద్వారానే ఎన్నోసార్లు పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి గారు ఆర్థిక సాయం చేశారు.
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం తర్వాత.. ఆమె కుమార్తె పలు యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడుతూ ఇండస్ట్రీని, ముఖ్యంగా కొంత బ్లేమ్ చేసేలా చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమను తీవ్ర… pic.twitter.com/yr68qHXxrd
— Suresh Kondeti (@santoshamsuresh) August 1, 2026
పావలా శ్యామలతో సురేష్ కొండేటి.. వీడియో
నా ద్వారానే ఎన్నోసార్లు పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి గారు ఆర్థిక సాయం చేశారు.
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం తర్వాత.. ఆమె కుమార్తె పలు యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడుతూ ఇండస్ట్రీని, ముఖ్యంగా కొంత బ్లేమ్ చేసేలా చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమను తీవ్ర… pic.twitter.com/t3dAL73tio
— Suresh Kondeti (@santoshamsuresh) August 1, 2026
ప్రస్తుతం సురేష్ కొండేటి పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.