Andhra Pradesh: బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
కర్నూల్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్లో కాల్పుల కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ టీమ్ తీవ్ర ఉత్కంఠ మధ్య ఓటమి పాలైంది. ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ హాజరుకాగా.. పెద్ద సంఖ్యలో నగరవాసులు పోటీలను వీక్షించేందుకు తరలివచ్చారు. ఓటమితో వ్యాపారి కౌశిక్ తీవ్ర అవమానం, నిరాశకు గురయ్యాడు. ఓటమిని తట్టుకోలేక తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు…