Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే?
ఇష్టమైన ఆహారం విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కారింగు లింగయ్య, లింగమ్మ దంపతులు కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారికి వివాహాలు కావడంతో అత్తారింటికి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. లింగమ్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నడిపించడంలో భర్తకు సహకరిస్తోంది. అయితే లింగయ్యకు పంది…