Bhogapuram: గ్రాండ్గా అల్లూరి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసిన సీఎం, రాష్ట్రానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ అని వివరించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు…