Headlines

బిగ్ న్యూస్.. తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు.. ఈ ప్రాంతాల భూములు పరిశీలన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విమానాశ్రయ ఏర్పాటుకు గుర్తించిన ప్రతిపాదిత స్థలాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మల్టీ డిసిప్లినరీ సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సాంకేతికపరమైన అంశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతోపాటు.. కొత్తగూడెం పరిధిలోని ప్రతిపాదిత స్థలాల్లో విస్తృతంగా పరిశీలిస్తున్నారు. ఏఏఐ సభ్యులు భరత్ రెడ్డి, ఎండీ ఏవియేషన్ నేతృత్వంలోని సాంకేతిక బృందం ప్రతిపాదిత విమానాశ్రయ స్థలాలను మంగళవారం కూడా పరిశీలించింది. భూమి లభ్యత, స్థల…

Read Full News

ODI Runs 2026: గిల్ టాప్.. కోహ్లీ సెవెన్త్.. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?

ODI Runs 2026: 2026 అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. జో రూట్, విరాట్ కోహ్లీ సహా టాప్-7లో చోటు దక్కించుకున్న మిగతా స్టార్ ప్లేయర్లు ఎవరోచూద్దాం. అగ్రస్థానంలో దూసుకెళ్తున్న శుభ్‌మన్ గిల్ టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9…

Read Full News

Telangana: తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే.. ప్రారంభం వచ్చే నెలలోనే.. కేవలం 45 నిమిషాల్లోనే వెళ్లొచ్చు..

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మరో కొత్త నేషనల్ హైవే రాష్ట్ర ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి అవ్వగా.. త్వరలోనే ప్రారంభోత్సవం చేసి ప్రయాణికులను అనుమతించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం హైవేవై ట్రయల్ రన్ జరుగుతుండగా.. రోడ్డుపై ఏమైనా లోపాలు, సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారత్ మాల ప్రాజెక్టులో…

Read Full News

జస్ట్ రూ.32కే కిలో ఉల్లిపాయలు.. ప్రజలకు డబుల్ ధమాకా..

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లలో, అలాగే మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను కిలో రూ.32కే అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను కలిసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీలో ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యవసరాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారు. అలాగే ఇకపై…

Read Full News

Andhra News: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి!

తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన 13 రోజులకే ఓ చిన్నారి సరికొత్త రికార్డు సాధించింది. ఏకంగా ఆ పాప పేరు ఇంటర్నేషనల్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ నమ్మాల్సిందే! శ్రీకాకుళం జిల్లాకు చెందిన వజ్రపు ఆశిష్, గీతామాధురి దంపతుల కుమార్తె అగస్య ప్రిన్సీ పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ పొంది సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 19 రోజుల వయసు గల చిన్నారి పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ సరికొత్త చరిత్ర…

Read Full News

Mohammed Shami: 11 ఓవర్లు, 4 మేడిన్లు.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో దుమ్ములేపిన షమీ.. రీ-ఎంట్రీకి దారులు సిద్ధం

Mohammed Shami: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన షమీ, అద్భుతమైన బౌలింగ్ స్పెల్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగా సిగ్నల్స్ పంపిస్తున్నాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ సమరం హోరాహోరీగా…

Read Full News

ఇవి రోజూ ఒక స్పూన్ తాగితే.. మతిమరుపు, నరాల వణుకు, మంటలకు చిటికెలో చెక్ పెడుతుంది

ప్రతిరోజు అరగంట పాటు సూర్యరశ్మిలో గడపడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని 40% పైగా తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మెదడు కణాల మరమ్మత్తు, శుభ్రపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ లేదా వంశపారంపర్యంగా వచ్చే మతిమరుపు చాలామందిని వేధించే సమస్య. అయితే, దీనిని నివారించడానికి ఒక సులువైన మార్గాన్ని చైనా పరిశోధకులు కనుగొన్నారు. 89 వేల మందిపై ఎనిమిదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది….

Read Full News

కలర్స్‌లోనే అసలు సీక్రెట్‌ అంతా దాగి ఉందా? 2027 మార్కెట్‌లోకి దూసుకొస్తున్న కవాసకి

సాధారణ మోడళ్లకు పూర్తి భిన్నంగా యూరోపియన్ మార్కెట్ కోసం ప్రత్యేక హంగులతో ఆవిష్కరించబడిన Z 650 S, Z 900 S, Z 900 SE శ్రేణి బైక్‌లు అత్యంత ఆకర్షణీయమైన రంగుల కలయికతో ఆకట్టుకుంటున్నాయి. రైడర్లకు మరింత సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్‌ను, స్టైలిష్ లుక్‌ను కల్పిస్తున్న ఈ మార్కెట్లో బైక్​లు భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ బైక్​ల ప్రత్యేకతేంటో తెలుసుకుందాం. కొత్త రంగుల విశేషాలు కవాసకి సంస్థ 2025 చివర్లో యూరోపియన్ మార్కెట్…

Read Full News

Telangana: ర్యాపిడో, ఉబర్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి రైడింగ్ యాప్.. అతి తక్కువ ధరల్లో ప్రయాణం..

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు, ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించింది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో ర్యాపిడో, ఉబర్, ఓలా లాంటి బైక్, ఆటో క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రైవేట్ యాప్స్‌లో ధరలు అధికంగా ఉండటంతో పాటు రిజిస్టర్ చేసుకుని సేవలు అందించేవారి నుంచి అధిక కమీషన్లు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా నష్టం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక…

Read Full News

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడింది. అంతేకాకుండా.. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.. దీనితో పాటుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 11 నాటికి…

Read Full News