ఈ నెల 20న అమెరికాకు భారత బృందం! వాటిపై కీలక చర్చలు
భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలపై మరోసారి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నెల చివర్లో ఇరుదేశాలు ముఖాముఖి వాణిజ్య చర్చలను పునఃప్రారంభించనున్నట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి. ప్రధాన సంధానకర్త నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఏప్రిల్ 20 నుంచి అమెరికాలో పర్యటించనుంది. సుమారు మూడు నుంచి నాలుగు నెలల విరామం తర్వాత జరగనున్న తొలి ప్రత్యక్ష సమావేశం కావడం విశేషం. ఈ మధ్యకాలంలో ఇరుపక్షాలు వర్చువల్ విధానంలో చర్చలు కొనసాగించాయి. ఫిబ్రవరి 7న విడుదలైన ఉమ్మడి ప్రకటనకు కొనసాగింపుగా…