ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..! విశాఖ – విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్వర్క్
న్యూఢిల్లీ: బుధవారం (సెప్టెంబర్ 09) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని ప్రధాన రైల్వే మార్గాలను మరింత ఆధునీకరించడంతో పాటు రవాణా సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏడు కీలక రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దక్షిణ భారత రైల్వే…