Andhra: అనంతపురంలో జరిగింది ఇది.. తెలుసుకోకుంటే మీకే చాలా నష్టం..
అపరిచితుల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వారు ఇచ్చే ఏ వస్తువులను ముట్టుకోవద్దని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఒకప్పుడు తినే పదార్థాల్లో మత్తు మందు కలిపి మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు, ఇప్పుడు తమ పంథాను మార్చుకున్నారు. కరెన్సీ నోట్లను ఉపయోగించి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ తరహా మోసాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అనంతపురంలో రామచంద్ర నగర్కు చెందిన తక్కిళ్లపాటి ఆదిలక్ష్మి అనే మహిళ ఈ మోసానికి బలయ్యారు. పనిమీద నగరంలో తిరుగుతున్న ఆమెను…