పదో తరగతి సర్టిఫికెట్లకు డిజిటల్ టచ్.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు!
అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు ఇకపై మరింత ఆధునికంగా మారనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు జారీ చేసే మెమోలపై QR కోడ్ను ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల టెన్త్ సర్టిఫికెట్లపై ముద్రించే QR కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే సంబంధిత విద్యార్థి మార్కుల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. QR కోడ్ ద్వారా విద్యార్థుల మార్కుల సమాచారాన్ని సులభంగా పరిశీలించేందుకు…