Headlines

Money Astrology: దుస్థాన బుధుడితో వారికి కష్టనష్టాలు..! ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..!

బుద్ధి కారకుడైన బుధుడు అనుకూలంగా ఉన్నంతవరకు తెలివితేటలు బాగా ప్రకాశిస్తాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. వ్యూహాలు, ప్రణాళికలు బాగా సక్సెస్ అవుతాయి. బుధుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ప్రతిఫలాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. జాతకంలోనూ, గ్రహ సంచారంలోనూ బుధుడు ఎంత అనుకూలంగా ఉంటే జీవితం అంతగా విజయవంతమవుతుంది. సెప్టెంబర్ 7 నుంచి 23 వరకు కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల మేషం, కర్కాటకం, తుల, కుంభం, మీన రాశులు ఆర్థిక…

Read Full News

Andhra Pradesh: కొత్తగా పింఛన్ అప్లై చేసుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ డాక్యుమెంట్స్ లేకున్నా ఓకే..

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన పేదలకు పింఛన్లు అందించే ప్రక్రియ మరింత సులభతరమైంది. ఎన్టీఆర్ భరోసా కింద కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ఎదురవుతున్న పెద్ద అడ్డంకిని తొలగిస్తూ ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో నివసించేవారు దరఖాస్తు చేయాలంటే ఇంటి పన్ను అసెస్‌మెంట్ రశీదు తప్పనిసరిగా జతచేయాల్సి వచ్చేది. సొంత ఇల్లు లేనివారు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో స్పందించిన యంత్రాంగం, వెబ్‌సైట్‌లో ఈ…

Read Full News

నెలలు గడిచినా.. ఇచ్చిన మాట మర్వలేదు.. విద్యార్థులకు గ్రూప్‌-1 అధికారుల అదిరిపోయే గిఫ్ట్

నెలలు గడిచినా ఇచ్చిన హామీని మర్చిపోకుండా నెరవేర్చారు గ్రూప్‌-1 శిక్షణాదికారులు. శిక్షణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా బురుగుపల్లి మహాత్మా జ్యోతి బా పూలే రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ను గ్రూప్ వన్ శిక్షణ అధికారులు ఫిబ్రవరి నెలలో సందర్శించారు. ఆ సమయంలో పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడిన అధికారులు.. వారి చదువుకు డిజిటల్ బోధన మరింత ఉపయోగపడుతుందని గుర్తించారు. పాఠ్యాంశాలను దృశ్యరూపంలో వివరించేందుకు పాఠశాలకు ప్రొజెక్టర్ అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాటకు అనుగుణంగా శనివారం పాఠశాలకు…

Read Full News

పెయింటింగ్‌కి లక్షలు తగలేసే బదులు.. తక్కువ ఖర్చుతో ఇంటిని ఇలా అందంగా మార్చుకోండి!

ఇంటి ఇంటీరియర్‌ను అందంగా, విలాసవంతంగా మార్చుకోవాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం గోడలకు పెయింటింగ్, వాల్‌పేపర్, వుడ్ ప్యానెల్స్ వంటి వాటిని ఉపయోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం వీటికి భిన్నంగా చెక్క టైల్స్ ట్రెండ్‌గా మారుతున్నాయి. గోడలు, సీలింగ్‌లకు సహజమైన చెక్కతో తయారు చేసిన టైల్స్‌ను అమర్చడం ద్వారా ఇంటికి ప్రత్యేకమైన లుక్ వస్తోంది. అంతేకాకుండా తరచూ పెయింటింగ్ చేయించుకోవాల్సిన అవసరం తగ్గుతుందని ఇంటీరియర్ నిపుణులు చెబుతున్నారు. సహజమైన చెక్కతో తయారీ చెక్క టైల్స్‌ను సాధారణంగా శీశం, టేకు, పైన్,…

Read Full News

ఎవరెస్ట్‌ కరిగిపోతోంది.. కారణం ఇదే!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ఇప్పుడు తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. పర్వతారోహకుల తాకిడి పెరగడంతో అక్కడి పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రతి ఏటా ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ఏర్పాటు చేసే దాదాపు 1600 గుడారాలు, కిచెన్లు, జనరేటర్లు, వైఫై వంటి ఆధునిక సౌకర్యాల వల్ల నేల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అధిక ఎత్తులో ఉండటం వల్ల క్లైంబర్లు ఎక్కువ నీరు తాగుతుంటారు. దీనివల్ల ఉత్పత్తి అయ్యే మూత్రం కూడా హిమానీనదం కరగటానికి కారణమవుతోంది. ఒక 2023…

Read Full News

కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్‌తో పనిలేదు డ్యూడ్‌!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన 20 ఏళ్ల సురేందర్ సింగ్ చౌదరి అలియాస్ బిట్టూ తబాహి సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. స్థానికంగా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యకూపంగా మారడాన్ని చూసిన బిట్టూ, డిగ్రీ చదువుతూనే దాన్ని తిరిగి జీవనదిగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సాయం లేకుండానే, ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒంటరిగా నది శుభ్రతను ప్రారంభించాడు. బిట్టూ అంకితభావాన్ని మెచ్చుకున్న కొందరు స్థానిక స్నేహితులు అతనికి తోడయ్యారు….

Read Full News

డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది

హైదరాబాద్‌లోని మూషీరాబాద్‌లో జరిగిన వినాయక ఉత్సవాలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. డీజే సౌండ్, భారీగా పోగైన జనసందోహం కారణంగా తన 22 ఏళ్ల కుమారుడు భద్రి ప్రాణాలు కోల్పోయాడని ఒక తల్లి కన్నీటిపర్యంతమైంది. తమ బిడ్డ బయటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే శవమై తిరిగి వచ్చాడని, తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తన కొడుకు అన్యాయంగా బలి అయ్యాడని ఆ తల్లి రోదించింది.తన కుమారుడి మరణానికి డీజేల విచ్చలవిడి వాడకం, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆమె…

Read Full News

పోలీసుల అదుపులో లేడీ డాన్‌.. ఈమె స్టోరీ తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో లేడీ డాన్గా పేరుపొందిన కోనేటి సులోచనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పులు ఇస్తానని నమ్మించి, ఆపై బెదిరింపులకు పాల్పడి బాధితుల ఆస్తులను అక్రమంగా కాజేశారనే ఆరోపణలపై ఆమెపై కేసులు నమోదయ్యాయి. పలువురు బాధితుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు అనుమతితో సులోచన నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్లతో పాటు ప్రాంసరీ నోట్లు, ఖాళీ బాండ్లు, స్టాంప్ పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని…

Read Full News

Toxic Movie: టాక్సిక్ సినిమాపై ఆశలు.. భారీ ప్రాజెక్ట్ వదులుకున్న యశ్.. డైరెక్టర్ కామెంట్స్..

కేజీఎఫ్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు యశ్. ఈ రెండు సినిమాల తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని టాక్సిక్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇందులో భారీ తారాగణం నటించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా కోసం యశ్ మరో భారీ ప్రాజెక్టు వదులుకున్నారట. ఈ విషయాన్ని డైరెక్టర్ పీఎస్ మిత్రన్ వెల్లడించారు. ఆయన…

Read Full News

అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు

చనిపోయాడని భావించిన కన్నబిడ్డ క్షేమంగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులుండవు. పంజాబ్‌లోని కపుర్తలాలో సరిగ్గా ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. కపుర్తలాకు చెందిన రవి కుమార్‌ అనే యువకుడు ఆగస్టు 5న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతని తండ్రి, సోదరుడు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో, పోలీసులకు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక యువకుడి…

Read Full News