వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఆర్ఎంపి డాక్టర్ దారుణ హత్య.. ఎక్కడంటే.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఘోరం జరిగింది. ధర్మవరం గ్రామంలో ఆర్ఎంపిగా ప్రాక్టీస్ చేస్తున్న మేడగం కోటిరెడ్డి అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. భార్య కళ్ల ముందే కోటిరెడ్డిని ప్రాణాలు తీశారు. అక్రమ సంబంధం కోణంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో ధర్మవరం గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆర్ఎంపి మేడగం కోటిరెడ్డి ఇంట్లో అర్ధరాత్రి వేళ మృత్యువు తాండవించింది. పక్కా…