ఉస్మానియా పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రి పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుమార్ (26) ఆత్మహత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సురేష్కు పీజీ నీట్ ద్వారా ఉస్మానియాలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది. అయితే అతడు జనరల్ మెడిసిన్లో సీటు వస్తుందని ఆశపడ్డాడని, సర్జరీ కోర్సుపై ఆసక్తి లేకపోవడంతో నిరాశకు గురైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. కోర్సు మార్చుకోవడానికి చివరి వరకు…