Headlines

Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి..

Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి..


కోసూరి వేణు గోపాల్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. గంభీరమైన గొంతు, భారీ కాయంతో కనిపించే ఈయన తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా నటించారు వేణు గోపాల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కోసూరి చాలా ఏళ్ల పాటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పని చేశారు. అయితే నటననపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాల్లో యాక్ట్ చేశారు. పి. ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన తెగింపు అనే చిత్రంతో నటుడుగా తన ప్రస్థానం ప్రారంభించారు వేణు గోపాల్. ఆ తర్వాత రాజమౌళి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క స్టూడెంట్ నంబర్ 1 తప్ప మిగతా అన్ని రాజమౌళి సినిమాల్లోనూ కోసూరి నటించడం విశేషం. ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు వేణు గోపాల్.

ఛత్రపతి, విక్రమార్కుడు, పిల్ల జమీందారు, భలేభలే మగాడివోయ్, అమీతుమీ, ఛలో.. ఇలా దాదాపు 30 సినిమాల్లో నటించారు కోసూరి వేణు గోపాల్. కాగా నటునిగా బిజీగా ఉన్న సమయంలోనే ఈయన కన్నుమూశారు. మహమ్మారి కరోనా కారణంగా కన్నుమూసిన నటుల్లో కోసూరి కూడా ఒకరు. కరోనాతో హైదరాబాదులోని గచ్చిబౌలిలో, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సుమారు 23 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నారు కోసూరి. ఆ తర్వాత కరోనా నెగటివ్ కూడా వచ్చింది. దీంతో కోసూరి కోలుకున్నట్లే కనిపించారు. కానీ అనూహ్యంగా కొద్ది రోజులకే 2020 సెప్టెంబరు 23 న తుదిశ్వాస విడిచారీ సీనియర్ నటుడు.

ఇవి కూడా చదవండి



నాగ శౌర్య కథానాయకుడిగా వచ్చిన ఛలో చిత్రంలో వెన్నెల కిషోర్ తండ్రి పాత్ర పోషించారు కోసూరి వేణుగోపాల్. నటుడిగా ఆయన చివరి చిత్రం ఇదే. ఇక వేణు గోపాల్ విషయానికి వస్తే.. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *