ఈ నెల(జూలై) 29న మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో కర్కాటక రాశిలో ఉన్న రవికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఆషాఢ పౌర్ణమి లేదా గురు పూర్ణిమ ఏర్పడింది. చంద్ర, రవులతో పాటు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు చంద్రుడికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడడం విశేషం. ఈ పౌర్ణమి వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకర, మీన రాశులకు ఆదాయ వృద్ధి, సంపద వృద్ధి, పదోన్నతులు, అధికారం, మంచి పరిచయాలు వంటి అదృష్టాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి ఫలితాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. గురు పూర్ణిమ రోజున గురు గ్రహానికి, దత్తాత్రేయ స్వామికి పూజ చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.