Weather Report: ఎండాకాలంలో చల్లని కబురు.. రెండ్రోజుల పాటు వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు ఉపశమనం
తెలుగు రాష్ట్రాల్లో భానుడు తీవ్రరూపం దాల్చుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడితో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో జనాలు భయపడిపోతున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతవారణశాఖ హెచ్చరిస్తోంది. శుక్రవారం కూడా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా…