Headlines
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమ.. చంద్రబాబు, పవన్ ఫోటోలకు పాలాభిషేకం

ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమ.. చంద్రబాబు, పవన్ ఫోటోలకు పాలాభిషేకం

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గుడిలో నేడు విడుదల చేసిన తల్లికి వందనం పథకంలో ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఎకౌంట్లో పడ్డాయి. చంద్రబాబు చెప్పినట్టుగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నెరవేర్చినందుకుగాను ఆ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. గోడి గ్రామానికి చెందిన చిరంజీవి రాజేశ్వరి దంపతులకు నలుగురు పిల్లలు ఉండగా నలుగురు పిల్లలకు గాను…

Read Full News
మలేరియా vs డెంగ్యూ vs చికెన్‌గున్యా.. ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి..? లక్షణాలు, జాగ్రత్తలు!

మలేరియా vs డెంగ్యూ vs చికెన్‌గున్యా.. ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి..? లక్షణాలు, జాగ్రత్తలు!

వర్షాకాలం వేడి నుండి ఖచ్చితంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ, అది అనేక ఆరోగ్య సమస్యలను కూడా వెంట తెస్తుంది. ఈ కాలంలో నీరు నిలిచిపోయి, దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ దోమలు మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. సమస్య ఏమిటంటే, ఈ మూడు వ్యాధులు ఒకే విధంగా ప్రారంభమవుతాయి. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం మరియు తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు, ఏ వ్యాధి దీనికి కారణమవుతోందో గుర్తించడంలో…

Read Full News
IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా?

IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా?

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో నిరాశ చెందిన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనతో కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా హరారే చేరుకుంది. ఈ సిరీస్ జూలై 23 నుంచి ప్రారంభం కానుండగా, మూడు మ్యాచ్‌లు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. వరుస విజయాలతో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే భారత…

Read Full News
తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ

తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల తన అధికారిక నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విక్సిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, యువత, క్రీడలు తదితర కీలక రంగాల్లో జరుగుతున్న పురోగతిని కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే అన్ని సంస్కరణలకు కేంద్రబిందువుగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే సంస్కరణలే దేశంలో నిజమైన మార్పును తీసుకురాగలవని మోదీ…

Read Full News
Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు!

Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు!

భానుడి భగభగలకు భూమాత అల్లాడిపోతోంది. వర్షాలు లేక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు పండాలని కోరుకుంటూ మెదక్ జిల్లాలో పాఠశాల విద్యార్థులు చేసిన వినూత్న ప్రార్థన అందరినీ ఆకట్టుకుంది. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకుంటూ చిన్నారులు చేసిన నృత్యం గ్రామస్తులను కదిలించింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల వేదికగా ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, లోకం…

Read Full News
Actress Sudha: శ్రీహరి, ఉదయ్ కిరణ్ ఇద్దరిని చివరి చూపు చూడలేకపోయాను.. కారణం ఇదే.. సీనియర్ నటి సుధ..

Actress Sudha: శ్రీహరి, ఉదయ్ కిరణ్ ఇద్దరిని చివరి చూపు చూడలేకపోయాను.. కారణం ఇదే.. సీనియర్ నటి సుధ..

సీనియర్ నటి సుధ, దివంగత నటుడు శ్రీహరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగమయ్యారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శ్రీహరితో పాటు ఆయన కుటుంబంతో సుదీర్ఘకాలంగా తమకు పరిచయం ఉందని తెలిపారు. డిస్కో శాంతి, ఆమె సోదరీమణులు, తల్లి, సోదరులతో చిన్ననాటి నుంచే సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. ముఖ్యంగా డిస్కో శాంతితో మంచి స్నేహం ఉందని, ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత శ్రీహరితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. శ్రీహరి మరణం తనను ఎంతగానో…

Read Full News
Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్

Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. అయితే ఏడుగురు కాకపోయినా కనీసం ఒకరు, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు అప్పుడప్పుడు మనకు తారసపడుతుంటారు. ఎలాంటి రక్త సంబంధం బంధుత్వం లేకున్నా ఒకే పోలికలతో కనిపించే వ్యక్తులు అక్కడక్కడ కనిపిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారిని ఇంగ్లిష్ లోడొపెల్ గ్యాంగర్స్ లేదా ట్విన్ స్ట్రేంజర్స్ అని పిలుస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇలా ఒకే పోలికలు ఉన్న వ్యక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. సోషల్…

Read Full News
ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!

ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!

ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడగానే చాలామంది రెస్ట్ తీసుకుంటారు.. లేదా చుట్టూ ఉన్న దృశ్యాలను చూస్తారు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి మాత్రం బైక్‌పై వెళ్తూనే రెడ్ సిగ్నల్ పడగానే ల్యాప్‌టాప్ తీసి పని చేయడం ప్రారంభించాడు. కార్పొరేట్ వర్క్ కల్చర్, వృత్తిగత జీవిత ఒత్తిడి ఎంత దారుణంగా ఉందో అద్దం పట్టేలా ఉన్న ఈ దృశ్యాన్ని వెనుక ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది….

Read Full News
Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో గాయత్రి సింహాద్రి ఒకరు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ 'కార్తీక దీపం 2 ' ద్వారా ఈమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనతో, విలక్షణమైన హావభావాలతో నెగెటివ్ పాత్రలోనైనా సరే ప్రేక్షకుల మనసు దోచుకున్న గాయత్రి, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలు, విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారిత…

Read Full News
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, కొన్ని ముఖ్య ఆలోచనలను పొరపాటున కూడా ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతున్నారు. తరవాత చేయబోయే పనులు : మీ చేయాలనుకున్న ప్రణాళికలను ముందుగా ఎవరితో చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మీరు ఇలా చేస్తే మీ ప్రణాళికలను…

Read Full News