Headlines

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?


పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త సామాజిక పింఛన్‌ల కోసం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. పెన్షన్ లేని అర్హులు సెప్టెంబర్ 7 నుండి 16 వరకు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, మత్స్యకారులు వంటి వృత్తిపరమైన కేటగిరీల పింఛన్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. వితంతువులు తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు సదరం ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఒంటరి మహిళలు విడాకుల పత్రాలు లేదా వివాహం కాలేదని తెలిపే తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం జతచేయాలి. దరఖాస్తు ప్రక్రియ కేవలం 20 రోజుల్లో పూర్తయి, అక్టోబర్ 1 నుండి కొత్త పింఛన్‌ల పంపిణీ ప్రారంభమవుతుంది.కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పౌస్ కేటగిరీ పింఛన్‌లు ఒక ముఖ్యమైన నిర్ణయం. పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే, మరుసటి నెల నుండే భార్యకు పింఛన్ మంజూరు చేస్తారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *