ఆశ చూపారు.. నిలువునా ముంచారు.. ఒకటి-రెండు కాదు.. ఏకంగా రూ. 500 కోట్లతో జంప్..!
పెట్టుబడికి రెండింతలు లాభం.. నెలానెలా పొదుపు చేస్తే కొండంత ఆదాయం.. అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, పేద, మధ్యతరగతి వర్గాలను నిలువునా ముంచేసింది ‘యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్’ సంస్థ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా సాగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, సంస్థ బోర్డు తిప్పేయడంతో వేలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు. గుజరాత్కు చెందిన ఒక వ్యక్తి 1996లో అహ్మదాబాద్ కేంద్రంగా ‘యూనిక్…