Andhra Pradesh: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటగా భాద్రపదంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అనంతరం అశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 14న రాత్రి 7 నుంచి 8 గంటల…