వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా
సాధారణంగా దొంగలు బంగారం, నగదు కోసం ఆశపడతారు. కానీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం ఓ “పాల దొంగ” షాపు యజమానులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే పాల ప్యాకెట్లు మాయమవుతుండటంతో అసలేం జరుగుతుందో తెలియక తలపట్టుకున్న యజమానికి, సీసీ కెమెరా దృశ్యాలు చూశాక అసలు విషయం బోధపడింది. జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్లో గల ‘తారా టీ స్టాల్’ వద్ద ఈ వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు పాల వ్యాన్…