ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు
అనుమానం పెనుభూతమైంది. కన్నతండ్రిని కసాయిగా మార్చింది.. కన్నపాశం యమపాశంగా మారింది. మానవత్వం మరిచి ముక్కుపచ్చలారని పసివాడిని నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుంది. అనుమానం అనే మాయదారి మహమ్మారి. తన పోలికలు రాలేదంటూ కన్నబిడ్డను కనికరం లేకుండా నదిలోకి విసిరేసాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన కర్నాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది. నాగఠాణెకు చెందిన మల్లికార్జున ఆరేకరి, భాగ్యశ్రీ దంపతులకు సిద్ధార్థ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఆరేళ్ల బాలుడు చూడటానికి ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటాడు. ముద్దులొలికే…