తిరుమలలో పాములు కనిపిస్తే చంపొద్దు.. ఇలా చేయాలంటున్న నిపుణులు
తిరుమలలో పాములు కనిపిస్తే భయంతో వాటిని చంపాల్సిన అవసరం లేదని సంగమిత్ర యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం. ఇంద్రీస్ సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని సురక్షితంగా రెస్క్యూ చేసి సహజ ఆవాసాల్లోకి తరలించాలని చెప్పారు. అయితే సర్పాల సంరక్షణతోపాటు భక్తులు, సిబ్బంది భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగులకు సర్పాల రెస్క్యూ, వృక్ష సంరక్షణపై మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం…