ఇలాక్కూడా చేస్తారా! ఇన్స్టా రీల్స్ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
శంషాబాద్: ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ రాము, రమావత్ మోతిలాల్, రమావత్ గాంధీ, సుధీర్ కలిసి నకిలీ నోట్ల తయారీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లోని రీల్స్ ద్వారా నకిలీ నోట్లు తయారు…