Headlines

Andhra News: ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి.. లోపలికెళ్లి చూడగా..


కొడుకు పని నుండి ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో కనిపించింది. ఈ సీన్ చూసి ఒక్కసారి కొడుకు ఖంగుతిన్నాడు. వెంటనే స్తానికలు సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఉండాల్సిన 2.5 లక్షల నగదు, ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలు కనిపించడం లేదన్న అంశాన్ని కొడుకు పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లాడు. దీంతో బంగారు ఆభరణాలు, డబ్బు కోసమే హత్య జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన దాది కోటేశ్వరమ్మ పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. పశుపోషణ చేసుకుంటూ జీవిస్తుంది. కోటేశ్వరమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో ఆమె అత్తగారింటికి వెళ్లింది. ఇక మిగిలిని కొడుకు సాదిక్ తో కలిసి నివస్తుంది. ఆమెకు స్వంత ఇల్లు లేకపోవడంతో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే డ్వాక్రా రుణం తీసుకొని స్వంత ఇంటి నిర్మాణం చేసుకోవాలని అమ్మాకొడుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక డ్వాక్రా రుణం రెండున్నర లక్షల రూపాయల తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు.

ఇక త్వరలోనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. కానీ ఇంతలోనే ఊహించన సంఘటన జరిగింది. ఏదో పని నిమిత్తం ఆదివారం ఉదయం కొడుకు సాదిక్ బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఇంట్లో తల్లి కోటేశ్వరమ్మ రక్తపు మడుగులో కనిపించింది. అది చూసిన సాదిక్ గుండె పగిలింది.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. కాసేపటికి తేరుకొని స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఫోరెన్సిక్ టీమ్ సహాయంతో ఘటనా స్థలానికి పూర్తిగా పరిశీలించారు. అయితే సాదిక్ ఏదో డౌట్ వచ్చి ఇంట్లో ఉండాల్సిన నగదు, బంగారు ఆభరణాలు ఉన్నాయా లేదా అని చూశాడు.. కానీ అక్కడ అవేవి కనిపించలేదు. దీంతో దొంగతనానికి వచ్చిన వారే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *