Headlines

rajeshchukka117@gmail.com

ఒక లోక్‌సభ సహా ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు.. మమతా బెనర్జీ మళ్లీ పోటీ చేస్తారా..?

దేశవ్యాప్తంగా ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఈ ఆరు స్థానాల్లో అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 16…

Read Full News

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

టాలీవుడ్ డ్యాన్సర్స్‌ అసోసియేషన్ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. రఘు మాస్టర్ అడ్హాక్ కమిటీకి, ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత కమిటీకి మధ్య విభేదాలు ముదిరాయి. ఈ వివాదం రాయదుర్గం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. రఘు మాస్టర్ ప్యానెల్ బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించిందని సుమలత ఫిర్యాదు చేయగా, సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని రఘు మాస్టర్ ఆరోపించారు. ఫెడరేషన్ తమ కార్యవర్గాన్ని గుర్తించిందని, అందుకే బ్యాంకును ఆశ్రయించామని…

Read Full News

వైయస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి.. అమెరికా డాక్టర్‌తో కూతురు అంజలి నిశ్చితార్థం ఖాయం!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె కుమార్తె అంజలి వివాహం అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన సోముల రఘురామిరెడ్డితో నిశ్చయమైంది. ఈ శుభవార్తతో వైయస్సార్ కుటుంబంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. అయితే, ఇంతకీ ఎవరీ ఎవరీ సోముల రఘురామిరెడ్డి? అనేది ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూతురు అంజలి వివాహం అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోముల రఘురామిరెడ్డితో నిశ్చయమైంది. స్వస్థలం నంద్యాల…

Read Full News

నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న అక్కడి రైతులు

రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి నీటిని నమ్ముకునే కన్నా సూర్యుని నమ్ముకుంటే మేలని వారి భూములను సోలార్ విద్యుత్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం మంది రైతులు ఇదే బాట పట్టారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం విద్యుత్ హబ్ గా అడుగులు వేస్తుంది. ఇక్కడ ఉన్న రైతులు నీటి కొరతతో పంటలు వేయడం ఆపివేసి సోలార్ విద్యుత్…

Read Full News

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌..!

Vande Bharat: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శాఖ తీపి కబురు అందించింది. కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ నుండి బెంగళూరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి నూతన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలును ప్రారంభించాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఓ ఎంపీ అభ్యర్థన మేరకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదనతో ఏపీలో మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రానుంది. శివమొగ్గ…

Read Full News

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

లోకనాయకుడు కమల్ హాసన్ అనూహ్యమైన వేగంతో వరుస సినిమాలను ప్రకటిస్తూ కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నారు. ఆయన ప్రాజెక్టుల జాబితా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఈ సినిమాల షూటింగ్ అప్డేట్స్‌పై మాత్రం సరైన స్పష్టత కొరవడుతోంది.తన 234వ చిత్రంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా భారీ అంచనాలను అందుకున్నప్పటికీ, ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత కమల్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో గందరగోళం నెలకొంది. యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న అంబు…

Read Full News

ఆ సీఐ నోటి దురుసు! వృద్ధ మహిళపై అసభ్యకర పదజాలం.. వైరల్‌గా మారిన వీడియో

బాపట్ల జిల్లా చీరాల టూటౌన్ సీఐ శశికుమార్ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ ఓ ఇంటి బయట వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. సీసీ కెమెరాలో నమోదైన ఈ దశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌చల్‌ చేస్తున్నాయి. చట్టప్రకారం, నైతికంగా ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామ్‌నగర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఘటన పోలీసు శాఖ ప్రతిష్టపై…

Read Full News

గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు.. కోర్కెలు తీర్చే దేవుడు!

గణేశుడు ఆటంకాలను తొలగించేవాడని, ఆయనను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి పండల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆధ్యాత్మికత, సంస్కృతి, కళా నైపుణ్యం కొలువైన ఈ 5 ప్రసిద్ధ పండళ్లను ప్రతీ ఒక్కరూ తప్పక దర్శించాలి. లాల్‌బాగ్ చా రాజా (ముంబై): ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణపతి పండల్ ఇది. 1934లో స్థాపించబడిన…

Read Full News

అబ్బబ్బ.. ప్రయోజనాలు తెలిసి బొప్పాయిని తెగ లాగించేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

బొప్పాయి పండు దాని రుచి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలామందికి నచ్చిన పండు. ఇది మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది, దీనిని తరచుగా “ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్” అని పిలుస్తారు. బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఉదయం అల్పాహారం తీసుకోలేని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ డీ తగిన…

Read Full News

మగావాళ్లు జేబులో చిన్న దువ్వెన ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? సైకాలజీ ప్రకారం వారి క్యారెక్టర్ ఎలాంటిదంటే..

చాలామంది పురుషులు జేబులో వాలెట్, ఫోన్‌తో పాటు ఎప్పుడూ ఒక చిన్న దువ్వెనను తమ దగ్గర ఉంచుకుంటారు. చూడటానికి ఇది కేవలం ఒక సాధారణ వ్యక్తిగత శుభ్రత అలవాటుగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైకాలజీ ఉందని నిపుణులు చెబుతున్నారు. సైకాలజిస్ట్ జాన్ నెజ్లెక్ నివేదికల ప్రకారం ఈ అలవాటు వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. సెల్ఫ్-ప్రెజెంటేషన్, ఆత్మవిశ్వాసం: సైకాలజీ ప్రకారం.. జేబులో ఎప్పుడూ దువ్వెన ఉంచుకునే పురుషులు తమ రూపం, ఇతరుల…

Read Full News