Telangana: కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. భక్తులు రాసింది చూసి షాకైన అధికారులు..
భక్తుల కొంగుబంగారం, ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఒక అరుదైన, వినూత్న నిరసన వెలుగు చూసింది. సాధారణంగా భక్తులు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడానికి హుండీల్లో కానుకలు వేస్తుంటారు. కానీ కొండగట్టులో మాత్రం భక్తులు డబ్బులకు బదులుగా తమ ఆవేదన లేఖలను హుండీల్లో వేశారు. ‘‘సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?’’ అంటూ భక్తులు సూటిగా ప్రశ్నిస్తూ రాసిన లేఖలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఏం జరిగింది..? ఇటీవల కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి…