ఛాతీ నొప్పితో ఆస్పత్రికి మహిళ.. స్కానింగ్ తీయిస్తే కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు, ఒక కొవ్వొత్తి!
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన శస్త్రచికిత్సలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన 33 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 14 పెన్నులు, 5 చెక్క చెంచాలు, ఒక కొవ్వొత్తి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. అనంతరం లాప్రోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స చేసి వాటన్నింటినీ వైద్యులు బయటకు తీశారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి.. మండలంలోని పెట్లూరివారిపాలేనికి చెందిన 33 ఏళ్ల వివాహిత కొంతకాలంగా ఛాతీ నొప్పితో బాధపడుతోంది. నొప్పి…