కోరిన కోర్కెలు తీర్చే కుండలేశ్వరస్వామి.. కాశీకి ముందే.. ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించాల్సిందే!
మనదేశంలోని శివాలయాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా కాశీ విశ్వనాథ్ ఆలయం వెలసిల్లుతోంది. అయితే, మన తెలుగు రాష్ట్రంలోనే కాశీతో సరితూగే శివాలయం ఒకటి ఉంది. అదే పార్వతీ సమేత కుండలేశ్వరస్వామి ఆలయం. పవిత్ర గోదావరి నది తీరంలో వెలసిన ఈ కుండలేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. మార్కండేయ మహర్షి తన చంద్రశేఖరాష్టకంలో “కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం” అంటూ ఈ క్షేత్రాన్ని స్తుతించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఈ ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉందని…