భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
రాజమహేంద్రవరం నగరంలో ఆథ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక 9వ డివిజన్ బర్మాకాలనీలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గుణ ఉత్తర పౌర్ణమి ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళనాడు సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ఉత్సవంలో భక్తులు చూపిన అచంచలమైన భక్తి అబ్బురపరిచింది. సుమారు 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న వందలాది మంది భక్తులు, తెల్లవారుజామునే గోదావరి తీరంలోని పుష్కర ఘాట్కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, తమ మొక్కులు…