ప్రధాని మోదీ పర్యటన వేళ తుపాకీ కలకలం.. PMO అధికారినంటూ ఎంట్రీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్!
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం. అతని వద్ద నకిలీ PMO గుర్తింపు కార్డు, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక వివరాల ప్రకారం, ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రాంగణంలో ఈ…