హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..
దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం అవుతుంది. ఈ హైవేపై ప్రయాణించాలంటేనే వాహనదారుల వణికి పోతున్నారు. ఈ హైవేపై నిత్యం 50 వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగుతున్నాయి. ముఖ్యంగా వారాంతం, సెలవు దినాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద అధిక లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి.. కారుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో హైకోర్టు…