Chiranjeevi: ‘గబ్బర్ సింగ్’ రమేష్కు అండగా మెగా ఫ్యామిలీ.. తక్షణ సాయంగా 5లక్షల చెక్కుతో పాటు..
‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి.. వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రమేష్ సతీమణికి తన తరఫున రూ. 3 లక్షల చెక్కును…