పట్టణాల్లో ఉన్న పేదలకు పండగే.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 పథకానికి సంబంధించి కేంద్రం కీలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న న్యూఢిల్లీలో జరిగిన 6వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కొత్తగా 2.88 లక్షల ఇళ్లనుమంజూరు చేసింది. కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ కటికితల అధ్యక్షతన జరిగిన ఈ నిర్ణయంతో PMAY-U 2.0 కింద ఇప్పటివరకు మంజూరైన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61 లక్షలకు చేరుకుంది….