శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో అమాయక భక్తులను నిలువునా ముంచేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని, రెండేళ్లుగా సాగుతున్న ఈ భారీ దందాకు ఎట్టకేలకు చెక్ పెట్టారు తిరుమల పోలీసులు . ఇద్దరు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ‘శ్రవణ్ కళ తిరుమల తిరుపతి దేవస్థానం’ పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలపై నకిలీ…