తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్! కారణం ఇదే
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యార్థి లోకం ఆగ్రహంతో రగిలిపోతోంది. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పదే పదే లోపాలపై విద్యార్థి సంఘాలు సమరశంఖం పూరించాయి. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల…