Headlines

Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే మీ నెలవారీ ఖర్చు సగం తగ్గుతుంది.. డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు..

కొన్నిసార్లు అవసరం లేకపోయినా వస్తువులు కొనుగోలు చేయడం, ఆఫర్లు, డిస్కౌట్ల మోజులో పడి విచ్చలవిడిగా చేసే కొనుగోళ్లు మీ ఖర్చును మరింత పెంచుతాయి. రూ. 500, రూ. రూ.1,500 లాంటి కొనుగోళ్లు మీకు తక్కువగా అనిపించినప్పటికీ.. నెల తిరిగే సరికి అవే అధిక ఖర్చును చూపిస్తాయి. ఇది మీ నెలవారీ బడ్జెట్‌ను తీవ్ర దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఆఫర్లకు ఆకర్షితులై వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటిని కొన్ని రోజులు వాడి ఆ తర్వాత పక్కన పడేస్తారు. ఇలాంటివి కూడా…

Read Full News

Jabardasth: ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా: జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కామెడీ వల్ల చాలా మంది క్రేజ్ తెచ్చుకున్నారు .. కొంతమంది కమెడియన్స్ గా సినిమాలు చేస్తుంటే మరికొంతమంది ఏకంగా హీరోలు, డైరెక్టర్లు కూడా అయ్యారు. కానీ జబర్దస్త్ వేదిక పై మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయమైన కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది తిరిగి వచ్చి జబర్దస్త్ చేసుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. చాలా మంది కమెడియన్స్ ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో లేదా ఇతర షోల్లో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది కమెడియన్స్ ఇప్పుడు…

Read Full News

నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే..

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దిగువన ఉన్న భారత్‌కు అవి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాల్లో పుట్టే నదులను ఇరు దేశాలు పంచుకుంటున్న నేపథ్యంలో నేపాల్‌లో వచ్చే వరద భారత్‌లో విపత్తుగా మారడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలపై పర్యావరణ, హైడ్రాలజీ నిపుణులు సమగ్ర విశ్లేషణను అందించారు. నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ…

Read Full News

పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత.. ఘోర నిర్లక్ష్యం అంటూ భారత్‌ ఆగ్రహం

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నారోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మైనార్టీల ప్రార్థనా మందిరాల పరిరక్షణలో పాక్ అధికారుల నిర్లక్ష్యం దిగ్భ్రాంతికరంగా ఉందని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కూల్చివేసిన ఆలయాన్ని…

Read Full News

Andhra Pradesh: ఏపీలోని యువతకు ప్రభుత్వం సూపర్ ఛాన్స్.. రూ.4 లక్షల వరకు పొందోచ్చు.. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు..

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. జనరిక్ మందుల షాప్ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించనుంది. రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల షాపులను యువతకు ప్రభుత్వం కేటాయించనుంది. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ చదువుకున్న బీసీ నిరుద్యోగ యువత దీని ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. తొలి విడతలో రాష్ట్రంలో 198 షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.7.92 కోట్లు కేటాయిస్తూ…

Read Full News

నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది.. విజయ్‌తో క్వాలిటీ టైం గడిపానన్న రష్మిక మందన్న

అందాల భామ రష్మిక మందన్న ఇటీవలే గాయం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.  రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. అలాగే లేడి ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’ చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొంటుంది రష్మిక. ఈ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ సీక్వెన్సుల కోసం నిరంతరం శ్రమించడంతో ఆమెకు హిప్ ప్రాంతంలో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. దాంతో రష్మిక అభిమానులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్….

Read Full News

Cyborg Cockroaches: విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో సరికొత్తగా..

భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటం సహాయక బృందాలకు అతిపెద్ద సవాలు. మనుషులు లేదా పెద్ద రోబోలు వెళ్లలేని అత్యంత ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లి ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు జీవశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ కలయికతో సైబోర్గ్ బొద్దింకలు అనే వినూత్న విపత్తు నిర్వహణ సాంకేతికతను రూపొందించారు. సైబోర్గ్ బొద్దింకలు ఎలా పనిచేస్తాయి? భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు సైబోర్గ్ బొద్దింకలను అభివృద్ధి…

Read Full News

ఆయుధాలు మిస్సింగ్.. 160 డిటోనేటర్లు ప్రత్యక్షం! బొల్లారం కంటోన్మెంట్‌లో అసలేం జరుగుతోంది?

దేశ సరిహద్దులను కాపాడే సైన్యం. దేశ రక్షణకు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు. అలాంటి ఆయుధాలను భద్రపరిచే ప్రదేశంలో ఎంతటి భద్రత ఉండాలి? ఎవరు పడితే వారు లోపలికి వెళ్లడానికి వీలు ఉండదు. ప్రతి ఆయుధానికి లెక్క ఉంటుంది. ప్రతి మ్యాగజైన్‌కు లెక్క ఉంటుంది. ప్రతి రౌండ్‌కు లెక్క ఉంటుంది. ఆయుధాలు ఎవరి అధీనంలో ఉన్నాయో రికార్డు ఉంటుంది. అలాంటి అత్యంత సున్నితమైన ప్రదేశం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌ కోటే, బెటాలియన్ మ్యాగజైన్‌లోనే ఆయుధాలు మాయమయ్యాయి….

Read Full News

తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు

ఈ త్రికూటాలయం చుట్టూ 382/1/2 & 382/1 సర్వే నంబర్లలో గల 0.275 ఎకరాల భూమిని పురావస్తుశాఖ రక్షిత ప్రాంతంగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలకు అనుమతులు ఉండవని పురావస్తుశాఖ అధికారులు ప్రకటించారు.జాతీయ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏ.ఎస్.ఐ స్వయంగా పర్యవేక్షించ బోతుంది.. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇకపై ఈ త్రికూటాలయం కనువిందు చేయబోతుంది.. ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదం, ఆధ్యాత్మిక…

Read Full News

అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగం.. వీరి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలియక సహజం. అయితే సెప్టెంబర్ 4న హంస రాజయోగం, బుదాధిత్య రాజయోగం, మాలవ్య రాజయోగం, నవపంచమ రాజయోగం ఏర్పడ నుంది. ఇలా ఒక్క రోజే నాలుగు రాజయోగాలు, కృష్ణాష్టమి రోజే ఏర్పడటం వలన నాలుగు రాశుల జీవితం చాలా ఆనందంగా కొనసాగిపోవడమే కాకుండా, వారికి పట్టింది బంగారం కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? సింహ రాశి : సింహ రాశి వారికి కృష్ణాష్టమి రోజు నాలుగు యోగాలు ఏర్పడటం…

Read Full News