సావిత్రి చివరి రోజుల్లో కోమాలో అచేతనంగా ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క తెలుగు నటి ఎవరంటే..
దివంగత నటి జమున గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత మహానటి సావిత్రి గారి జీవితంలోని విషాద ఘట్టాలను, తనతో ఆమెకున్న ఆత్మీయ అనుబంధాన్ని కన్నీళ్లతో వివరించారు. సావిత్రి పెళ్లి విషయంలో అప్పట్లో నాగేశ్వరరావు గారు, చక్రపాణి గారు వంటి పెద్దలు వద్దని వారించిన విషయాన్ని జమున గుర్తుచేసుకున్నారు. అప్పటికి తాను చిన్నదాన్నవడంతో వారి ప్రేమ వ్యవహారం గురించి పెద్దగా తెలియదని జమున పేర్కొన్నారు. అయితే, సావిత్రి గారికి పెళ్లయి, పిల్లలు పుట్టి, తర్వాత మద్యపానానికి బానిసైన సమయంలో…