ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే
ఏ ఆలయం లో అయినా బ్రాహ్మణులు అర్చకులుగా ఉంటారు. వేదమంత్రాలు చదువుతూ దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆశీర్వచనం చేస్తూ గౌరవ మర్యాదలు అందుకుంటారు. గ్రామ దేవతలు కొలువైన ఆలయాలలో స్థానిక సంప్రదాయాల ప్రకారం బ్రాహ్మణేతరులు అర్చకులుగా ఉండటం చూస్తాం. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం లో ఎస్ సి సామాజిక వర్గాల వారే అర్చకత్వం లో ఉండి స్వామికి నిత్య కైంకర్యాల నుంచి పూజదికాలవరకు అన్నీ చేయడం విశేషం….