లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు
ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల తహశీల్దార్ కార్యాలయం ముందు మూలపాడు రైతులు, కూటమి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్బుక్ల మంజూరులో జాప్యం, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహశీల్దార్, వీఆర్ఓ నరేంద్ర తమకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, పంచాయతీ వంటి ఇతర ప్రభుత్వ శాఖలు, అలాగే జిల్లా కలెక్టర్ తమ పట్ల సానుకూలంగా స్పందించినా, తహశీల్దార్ మాత్రం అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని…