ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
భక్తికి నిలయాలైన ఆలయాలే ఆ దొంగలకు టార్గెట్ అయ్యాయి. తాళం వేసి ఉన్న గుడులను ఎంచుకుని మరీ వారు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.దైవ చింతన లేని కేటుగాళ్లు వరుసగా నాలుగు ఆలయాలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకెళ్లారు.ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి, మడేలయ్య, గంగమ్మ, మరియు పెద్దమ్మ ఆలయాల తాళాలు పగలగొట్టి…