ఓటర్లకు వెల్కమ్ చెప్పిన అనుకోని అతిధి.. ఆ సీన్ చూసి యువత ఫిదా.!
తమిళనాడు శాసనసభ ఎన్నికల వేళ కోయంబత్తూరులో ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో ప్రజాస్వామ్య పండుగ సరికొత్త హంగులతో మెరిసిపోతోంది. నూటికి నూరు శాతం ఓటింగ్ సాధించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన వినూత్న ప్రయోగాలు ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగా, కోయంబత్తూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ‘టీనా’ అనే రోబో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద…