సెలబ్రెటీలు చాలా మంది ఎమోషనల్ షేర్ చేసుకుంటూ ఉంటారు. తమ జీవితంలో జరిగిన విషయాలను, చేదు అనుభవాలను. కెరీర్ లో ఎదుర్కున్న సమస్యలను పంచుకుంటూ ఉంటారు. కొందరు మీడియా ముందు దైర్యంగా మాట్లాడితే.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ భావాలను పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఓ హీరోయిన్ తన పెట్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఓ టీవీ షో వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ రెజీనా కాసాండ్రా.. సుధీర్ బాబు నటించిన శివ మనస్సులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది అందాల ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. అటు తమిళ్ లోనూ, హిందీలోనూ అవకాశాలు అందుకుంది. కానీ అంతగా అక్కడ రాణించలేకపోయింది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది రెజీనా అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది ఈ అమ్మడు. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినప్పటికీ లాభం లేకుండా పోయింది.
తెలుగులో ఈ అమ్మడు 14 సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి అదరగొట్టింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం ఓ టీవీ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది రెజీనా. ఈ షోలో రెజీనా తన పెట్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది.
ఈ డాన్స్ షోలో పెట్స్ బాధను తెలియజేసేలా ఓ పర్ఫామెన్స్ను చేశారు. దాంతో రెజీనా తన పెట్ ను గుర్తుచేసుకుంది. ట్స్కి ఏదైనా సమస్య వస్తే నిజంగానే అలా చేస్తాయి. నా ఇంట్లో 5 పెట్స్ ఉన్నాయి.. వాటిని నేను దత్తత తీసుకున్నా అని తెలిపింది. వాటిలో ఓ పిల్లికి కళ్లు లేవని.. అది ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుందని.. దానికి కళ్లు లేవు అని ఎవ్వరూ అనుకోరు.. మనం చెబితే గానీ ఆ విషయం ఎవ్వరికీ తెలీదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రెజీనా.




