
AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం (PPP) విధానంపై తీవ్ర చర్చ జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగిస్తూ, PPP విధానం పారదర్శకంగా ఉందని, టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూ, తమ ప్రభుత్వం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోందని,…