Headlines

పాత బెడ్‌షీట్‌ను అస్సలు పారేయకండి.. ఈ 4 ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు!

Old Bedsheet Uses Telugu: మన ఇంట్లోని లినెన్ కప్‌బోర్డ్‌లో రంగు వెలిసిపోయిన, పలుచబడిన లేదా చిరిగిపోతున్న పాత బెడ్‌షీట్లు తప్పకుండా ఉంటాయి. అవి ఇక మంచంపై పరుచుకోవడానికి పనికిరావని భావించి చాలామంది చెత్తలో పడేస్తుంటారు. అయితే పాత బెడ్‌షీట్‌ను వెంటనే పారేయాల్సిన అవసరం లేదు. వాటి పెద్ద పరిమాణం, మెత్తటి వస్త్రం, ఉతికి మళ్లీ వాడుకునే సౌకర్యం కారణంగా ఇంట్లో ఎన్నో రకాల పనులకు ఉపయోగించుకోవచ్చు. కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే పనికిరాదనుకున్న పాత బెడ్‌షీట్ కూడా…

Read Full News

Hyderabad: తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Tukkuguda Nurse Murder Case: తుక్కుగూడలో నర్సును దారుణంగా చంపేశాడో కిరాతకుడు. హాస్పిటల్‌ రూంలో స్నేహితురాలితో కలిసి ఉంటున్న యువతి ప్రాణాలు తీశాడో రాక్షసుడు. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో రూమ్‌‌‌‌లోకి ప్రవేశించిన సనా వుల్లాఖాన్‌ అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించడంతో ఇనుప రాడ్‌‌‌‌తో ముఖంపై బాదాడు. బాధితురాలు కేకలు వేయడంతో విషయం బయటకు వస్తుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే…

Read Full News

ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిది? సూర్యుడు నుంచి లక్ష్మీదేవి వరకు ప్రత్యేక పూజా వేళలు ఇవే!

Hindu puja timings Telugu: హిందూ సంప్రదాయంలో దేవుడిని పూజించడానికి కచ్చితంగా ఇలాంటి సమయమే ఉండాలనే నియమం లేదు. భక్తితో, మనస్ఫూర్తిగా ఎప్పుడైనా భగవంతుడిని స్మరించవచ్చు. అయితే సంప్రదాయ విశ్వాసాల ప్రకారం కొన్ని దేవతల పూజకు కొన్ని సమయాలు మరింత అనుకూలంగా ఉంటాయని చెబుతారు. ఆ సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య భగవానుడిని ఉదయం వేళ పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా తెల్లవారుజామున సుమారు 4:30 నుంచి ఉదయం 6 గంటల మధ్య సూర్యారాధన చేయడం…

Read Full News

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ పైకి.. హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా

కన్నడ నాటకు చెందిన చైత్ర రాయ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా సీరియల్స్ చూసే ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ నటి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. అష్టాచమ్మా సీరియల్‌తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది చైత్ర రాయ్. అందులో ఆమె అభినయం అందరినీ కట్టి పడేసింది. అత్తో అత్తమ్మ కూతురో, దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సూపర్ హిట్ సీరియల్స్‌లోనూ నటించింది…

Read Full News

అమెరికాను వెనక్కి నెట్టనున్న భారత్.. ప్రపంచంలోనే నెం. 2 మెట్రో నెట్‌వర్క్‌ వైపు.. వేగంగా అడుగులు!

అమెరికాలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ సుమారు 1,386 కిలోమీటర్లుగా ఉంది. భారత్‌ ప్రస్తుతం అమెరికా కంటే కేవలం 216 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వెనుకబడి ఉంది. సుమారు 8,000 కిలోమీటర్ల మెట్రో మార్గంతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2014 నాటికి దేశంలో కేవలం 5 నగరాలకే పరిమితమై, 245 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మెట్రో నెట్‌వర్క్‌.. గత దశాబ్ద కాలంలో దాదాపు ఐదు రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మరో…

Read Full News

Bigg Boss Telugu 10: ఒకప్పుడు మెడికల్ షాప్‌లో వర్కర్‌.. బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ గ్రాండ్ ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ లో భాగంగా ఎప్పటిలాగే హోస్ట్ కింగ్ నాగార్జున అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. అలాగే హీరో కార్తీ, మరో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ లాంఛింగ్ ఎపిసోడ్ లో సందడి చేశారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ గా అమన్ మసూద్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరుగుతోంది. కింగ్ నాగార్జున తన దైన హోస్టింగ్ తో షోను రక్తి కట్టిస్తున్నాడు. ముఖ్యంగా మొదటి రోజే కంటెస్టెంట్లకు టాస్క్ లు ఇచ్చి వారిలోని ట్యాలెంట్ ను పరీక్షిస్తున్నాడు. అలాగే కంటెండర్స్ ఓపికను కూడా పరీక్షస్తున్నాడు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మొదటి కంటెస్టెంట్ గా దేబ్ జానీ ఎంట్రీ ఇచ్చింది. హీరో త్రిగుణ్ రెండో కంటెండర గా హౌస్ లోకి అడుగు పెట్టాడు….

Read Full News

గుడ్‌న్యూస్.. కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరుకు ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు స్థాయిలోనే కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించేలా ప్రభుత్వం ప్రక్రియను సిద్ధం చేసింది. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నవారు ఇక దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ఎన్టీఆర్…

Read Full News

12 ఏళ్లకు ఒక్కసారి.. 280 కి.మీ కఠిన ప్రయాణం.. 17 వేల అడుగుల ఎత్తులో నందాదేవి రాజ్ జాత్ మహాయాత్ర!

Nanda Devi Jat Yatra 2026 Telugu: ఉత్తరాఖండ్ హిమాలయాల్లో జరిగే అత్యంత క్లిష్టమైన, పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో నందా దేవి రాజ్ జాత్ యాత్ర ఒకటి. హిమాలయాల మహాకుంభంగా పేరుగాంచిన ఈ అపురూప యాత్ర సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు, వందలాది గ్రామాల ప్రజలు కలిసి నిర్వహించే ఈ యాత్ర ఉత్తరాఖండ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న చమోలి జిల్లా పరిధిలోని…

Read Full News

టీవీ యాంకర్‌కు మరణశిక్ష ! డ్రగ్స్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు

 డ్రగ్స్ కేసులో ప్రముఖ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు కైరో  కోర్టు మరణశిక్ష విధించింది. కైరో క్రిమినల్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. సారా ఖలీఫా మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి, అక్రమ రవాణా చేస్తున్నట్లు అభియోగాలు రుజువయ్యాయి. పోలీసులు దాడులు చేసి సుమారు 750 కిలోలకు పైగా డ్రగ్స్, ముడి పదార్థాలు, అలాగే అనుమతి లేని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ కోసం ప్రత్యేకంగా కొన్ని అపార్ట్‌మెంట్లను…

Read Full News