Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
వచ్చే నెల మార్చి 3వ తేదీన దేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గ్రహణ కాల నియమాలను పాటిస్తూ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 3న ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. కేవలం ఉదయం 4:30 నుండి 5:30 వరకు, తిరిగి రాత్రి…