PM Modi: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రధాని మోదీ అత్యవసర మీటింగ్.. వాటిపై కీలక చర్చ..
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి భద్రతా కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్న కాసేపటికే ప్రధాని మోదీ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో దేశ భద్రత, వ్యూహాత్మక విషయాలపై ప్రధానంగా చర్చించారు. పశ్చిమాసియాలో నివసిస్తున్న సుమారు 9 మిలియన్ల మంది భారతీయుల భద్రతపై CCS…