పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
సాధారణంగా భక్తులు ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుని, పూజారి చేత తలపై ‘శఠగోపం’ పెట్టించుకుని ఆశీస్సులు పొందుతారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా ఆ వెండి శఠగోపం పైనే కన్నేసి, దాన్ని తన సంచిలో వేసుకుని చక్కగా చెక్కేశాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ వింత చోరీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా ఆలయానికి రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి భక్తుడిలా…